Tuesday, April 30, 2024

TS: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు…

ఇల్లందు…. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ చందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ లు అన్నారు. ఈరోజు వారి కార్యలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… విద్య, ఉపాధి, నీళ్ళు, నియామకాల విషయంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో సాగునీరు అందించడంలోనూ, ఆదివాసీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మోడీ నాయకత్వంలో ప్రజలకు అవసరమైన అనేక పథకాలు లభించాయన్నారు. మోడీ మాత్రమే ఈ దేశానికి శ్రీ రామరక్ష అని పేర్కొన్నారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మేల్యే ధర్మారావు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, యాపా సీతయ్య, గోపి కృష్ణ, మాధవ్ వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement