Friday, May 17, 2024

నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి – మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ విపి గౌతంతో కలిసి వివి.పాలం గ్రామ సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పువ్వాడ పరిశీలించారు. భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబందించిన పనులను పరిశీలిస్తూ, ప్లాన్ ప్రకారంగా పనులను కొనసాగుతున్నాయా లేదా అని పరిశీలించారు. పౌర సేవల, పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని 44కోట్లతో 1,69,000వేల చ.అ.విస్తీర్ణంలో చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే మెయిన్‌ బిల్డింగ్‌ స్లాబ్లు నిర్మాణ పనులు, సివిల్ పనులు పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. అన్ని గదులలో ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. భవనం మొత్తం తిరిగి విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, చదును చేసిన అనంతరం నడక దారి, కాంపౌండ్ వాల్ చేపట్టాలని సూచించారు. భవన సముదాయం వెనక భాగంలో సీసీ రోడ్డు, పాత్ వే పనులను పరిశీలించారు. భవనం గోడకు ఆనుకొని పాట్ ప్లాంటింగ్ ఉండాలని, ఆ తర్వాత వరుసలో మొక్కలు ప్లాంటేషన్ చేసి, ప్లాంటేషన్ తర్వాత సీసీ రోడ్ చేపట్టాలన్నారు. భవన సముదాయం మధ్యలో చేపట్టవల్సిన ప్లాంటింగ్, లాన్ పనులను సుందరంగా ఉండేలా చూడాలని అదేశించారు. అవసరమైనంత మేరకు కూలీల సంఖ్య పెంచి పనుల వేగం పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తవుతున్న పనుల వివరాల నివేదికను అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయ‌ర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాoప్రసాద్, MRO నర్సింహారావు, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న, కార్పొరేటర్లు కమర్తపు మురళి, వలరాజ్, నాయకులు RJC కృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement