Friday, April 26, 2024

ఆస్ప‌త్రుల్లో మ‌రిన్ని వ‌స‌తులు క‌ల్పించండి – మంత్రి హ‌రీష్ రావుని కోరిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

జిల్లాలో మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేట హాస్పటల్ కి డయాలసిస్ సెంటర్స్ మంజూరు చేయాలని హైదరాబాదులోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు నివాసంలో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి కోర‌డం జ‌రిగింది. అదేవిధంగా ఆళ్లపల్లి, జానంపేట హాస్పిటల్స్ 24 గంటల సర్వీస్ అందించాలని, గుండాల హాస్పటల్లో పోస్టు మార్టం సెంటర్ ఏర్పాటు చేయాలని, మణుగూరు హాస్పటల్ లో ఎక్యుప్ మెంట్ కొరకు 50 లక్షలు మంజూరు చేయాలని ఆళ్లపల్లి, కరకగూడెం PHCలకు, ప్రహరీ గోడ, నిర్మించేందుకు నిధులు తక్షణమే మంజూరు చేయాల‌ని విన్నవించడం జరిగింది. ఈ మేర‌కు మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందిస్తూ వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement