Monday, May 6, 2024

ఖ‌మ్మం జిల్లాలో మంకీ ఫాక్స్ కలకలం.. గ్రానైట్ కంపెనీలో ప‌నిచేసే వ్య‌క్తికి ల‌క్ష‌ణాలు

ఖమ్మం వైద్య విభాగం (ప్రభా న్యూస్): ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో మంకీఫాక్స్ కలకలం సృష్టించింది. ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల గ్రామంలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తికి మంకీ ఫాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ అనే వ్య‌క్తి కొన్ని సంవత్సరాలుగా గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కాగా అతను మూడు రోజుల నుండి అనారోగ్యానికి గురి కావడంతో ఖమ్మం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తాత్కాలిక చికిత్య కోసం వ‌చ్చాడు. దీంతో డాక్ట‌ర్లు మెడిక‌ల్ టెస్టులు చేశారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్ట‌ర్లు సందీప్ ను పరిక్షించి మంకీఫాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో జిల్లా వైద్య అధికారిని డాక్టర్ బి. మాలతి సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement