Thursday, April 25, 2024

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ కు.. మంత్రి పువ్వాడ ఘన నివాళి

ఖమ్మం : విశ్వవిఖ్యాత నట సార్వభౌమూడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్వర్యంలో హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరానికి ఎదిగి తమ నటనలో తనదైన గుర్తింపు సాదించుకుని ఎన్ని వైవిద్యమైన పత్రాలు పోషించి, విలక్షణమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.ఎన్టీఆర్ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని కీర్తించారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.నివాళులు అర్పించిన వారిలో NTR కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ, మనవరాలు ప్రసన్న తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement