Thursday, May 2, 2024

KHM: కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ… అశ్వ‌రావుపేట అభ్య‌ర్థి ఎవ‌ర‌నే చర్చలు

చంద్రుగొండ, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్) : చంద్రుగొండ మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అశ్వరావుపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోన‌ని ఉత్కంఠతో ప్రతిక్షణం ఎదురుచూస్తూ ఎక్కడికక్కడ చర్చలు చేస్తూ బేరేజీ వేస్తూ మాట్లాడుకోవడం చూస్తుంటే అభ్యర్థి ఎంపిక కోసం అధిష్టానం కుస్తీలు పడుతున్నారని, ఎవరినీ నొప్పించకుండా అభ్యర్థిని ప్రకటిస్తారని కాంగ్రెస్ నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు జారి ఆదినారాయణలలో ఎవరో ఒకరికి వస్తుందనేదే ఎక్కువగా చర్చ జరుగుతుంది.

మహిళా అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం ప్రథ‌మంగా ములకలపల్లి జెడ్పీటీసీ, టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి ఉంటారని, తప్పితే టీపీసీసీ సభ్యురాలు వగెల పూజ బరిలో ఉంటారని ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో వర్గాలకతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను విస్తృతంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇంటిలిజెన్స్ నివేదికతో పాటు అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని అంటూనే కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా అభ్యర్థి ఎవరైనా సరే ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement