Friday, May 3, 2024

KHM: బీఆర్ఎస్ గెలుపు కామన్.. మెజార్టీ కోసమే ప్రచారం.. హరిప్రియ నాయక్

ఇల్లందు : బీఆర్ఎస్ గెలుపు కామన్ అని.. మెజార్టీ కోసమే ప్రచారమని ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీలో బానోత్ హరిప్రియ నాయక్ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు డీజే పాటలకు ఉల్లాసంగా డ్యాన్సులు వేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈసందర్భంగా గత ఎన్నికల్లో తనను ఎలాగైతే ఆదరించారో ఈ ఎన్నికల్లో అలాగే ఆదరించాలని కోరారు. గ్యారంటీ లేని గ్యారంటీ పథకాలతో మీముందుకు వస్తున్న కాంగ్రెస్ ను ఓడించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement