Sunday, May 5, 2024

ఎమ్మెల్యే వ‌న‌మా వింధుకు హాజ‌రైన బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు

పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు స్వగృహంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమ‌య్యారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సుడా చైర్మన్ విజయబాబు, ఖమ్మం మేయర్ నీరజ, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, DV వెంకటేశ్వర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, పెద్దమ్మ గుడి చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement