Saturday, July 27, 2024

TS | వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘ‌ట‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల కేంద్రం లోని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, కూలీ పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ చేప‌డుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement