Saturday, September 21, 2024

Khammam – బిఆర్ఎస్ చేరిన మాజీ మంత్రి సంబాని చంద్ర‌శేఖ‌ర్

ఖ‌మ్మం : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంభాని చంద్రశేఖర్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ర‌విచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ..తన 50 ఏళ్ల కాంగ్రెస్ జీవితానికి కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, తాను ఖమ్మం జిల్లాతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement