Friday, May 3, 2024

కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం.. మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి అధ్యక్షతన దేవరుప్పులలో పాలకుర్తి నియోజకవర్గ BRS పార్టీ ప్రతినిధుల మహాసభ జరుగుతోంది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ పతాకాన్ని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. సమావేశానికి ముందు అమరవీరుల స్థూపానికి మంత్రి నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తేడాపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలన్నారు. బండి సంజయ్ నీకు సిగ్గుందా ?!.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నష్టపరిహారం రూ.20వేలు ఇస్తున్నారా..? ఇక్కడ ఎలా అడుగుతున్నారు ? అన్నారు. ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న దేవుడు కేసీఆర్… నీకు సిగ్గుంటే, దమ్ముంటే కేంద్రం నుండి మరో పది వేలు ఇప్పించాలన్నారు.

గులాబీ సైనికులంతా ఒకే కుటుంబమని, మనమంతా కలిసిమెలసి ఉందామని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంకు అడ్డుపడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తిప్పి కొడదామన్నారు. ఈ కార్యక్రమంలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప్లీన‌రీ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరు గొమ్ముల సుధాకర్ రావు, నియోజకవర్గంలోని వివిధ మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement