Wednesday, May 1, 2024

Rajagopal Reddy: గ‌జ్వేల్‌లో ప్ర‌చారం చేస్తే కేసీఆర్ ఓడిపోయేవారు…. రాజ‌గోపాల్‌రెడ్డి

గ‌జ్వేల్‌లోతాను ప్ర‌చారం చేస్తే కేసీఆర్ ఓడిపోయేవారని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ డిప్యూటీ సీఎంగా హైకమాండ్ ఎంపిక చేయడంపై రాజగోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం భట్టి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా భట్టి నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయితే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించాలని తాను ఆశించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు దక్కకపోయినా సెకండ్ ఫేజ్ (మంత్రివర్గ విస్తరణ) లో తనకు తప్పకుండా చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పదవి చేపడితే ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని దేశం మొత్తానికీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement