Sunday, May 19, 2024

TS : కేసీఆర్ ప‌ని అయిపోయింది..కిష‌న్ రెడ్డి

కేసీఆర్ పోయిండు.. ఆయన పని అయిపోయింది.. కేసీఆర్ ఇక రాడు అంటూ కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు… ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంటే … అల‌వికాని వాగ్ధానాల‌తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను నమ్మక ద్రోహం చేసింద‌న్నారు.. కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసిన కూడా ప్రజలు నమ్మరు.. ఓట్లు పడవని అన్నారు… యూసుఫ్ గూడ కృష్ణానగర్ లో జైన్ మందిర్ ను నేడు ఆయ‌న సందర్శించారు. అనంతరం మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ, శ్రీనగర్ నగర్ డివిజన్, హైలైన్ కాలనీ నుంచి కిషన్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.

- Advertisement -

మోదీ లేని దేశాన్ని ఊహించ‌లేం ..
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేమన్నారు. దేశానికి ఎవరు ప్రధాని కావాలో.. ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు ఇవి అని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే మనం కొనసాగాలన్నారు. దేశంలోని అనేక సమస్యలను మోదీ పరిష్కరించార‌న్నారు.
25న అమిత్ షా ప్ర‌చారం..
కేంద్ర హోం మంత్రి 25వ తేదీన అమిత్ షా తెలంగాణ‌కు వస్తున్నార‌ని తెలిపారు కిష‌న్ రెడ్డి. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆయ‌న సభ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విడ‌ద‌ల వారిగా జాతీయ నేతల సభలు ఉంటాయ‌ని, ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. అలాగే మోదీ కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement