Friday, May 10, 2024

Maharashtra – రేపు పండరీపురం వెళ్లనున్న సీఎం కేసీఆర్ – పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బాల్క సుమన్

హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పండర్పూర్ కు వెళ్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ నుండి భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్ల తో కలసి భారీ కాన్వాయ్ తో రోడ్డు మార్గాన పండర్పూర్ వెళ్ళనున్నారు.

మంగళవారం మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన విట్టల రుక్మిణి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భారత రాష్ట్ర సమితిలోకి మహారాష్ట్రకు చెందిన ముఖ్యులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత తుల్జాపూర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పండర్పూర్లో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement