Wednesday, May 1, 2024

కేసీఆర్ పథకాలు అట్టర్ ప్లాప్ : తెలంగాణ‌లో వ‌చ్చేది బీజేపీయే : డీకే అరుణ

తెలంగాణ‌లో కేసీఆర్‌ పథకాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని, ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని.. రాబోయే ఎన్నిక‌ల్లో వ‌చ్చేది బీజేపీయేన‌ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆమె స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానమన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేశారని… మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 30 సంవత్సరాల తరువాత వరుసగా రెండవ సారి తిరిగి ఒకే పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దుంధుబీ మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement