Monday, April 29, 2024

KCR: చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయల్దేరిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయల్దేరారు. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రైతులు, జనాలు భారీగా తరలివస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఈ సభ ద్వారా కేసీఆర్‌ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement