Friday, April 26, 2024

మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్‌..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జగిత్యాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈసంద‌ర్భంగా జగిత్యాల‌లో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement