Sunday, April 28, 2024

Peddapalli: సంక్షేమ పాలన కేసీఆర్‌కే సాధ్యం.. ఎమ్మెల్యే దాసరి

ఎలిగేడు, అక్టోబర్‌ 12 (ప్రభన్యూస్‌): సంక్షేమ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ గుర్రం మల్లారెడ్డి, రెడ్డి సంఘం బోర్డు మెంబర్‌ కోమటిరెడ్డి కిషన్‌రెడ్డిలు కాంగ్రెస్‌ పార్టీని వీడి ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే దాసరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం దాసరి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement