Monday, April 29, 2024

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు : మంత్రి కొప్పుల

భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉంటామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంది రిజర్వాయర్ కింద ఉన్న గంగపుత్ర కాలనీ లోని కొన్ని ఇండ్లు ముంపునకు గురికావడంతో గురువారం ఆ ప్రాంతాన్ని తెప్ప మీద వెళ్లి సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు.

అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా 45 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5,200 రూపాయలతో పాటుగా మరో 5,000‌ రూపాయలు తాను అందిస్తానన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు లేకుండా చూస్తామన్నారు. మంత్రి వెంట తెరాస ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement