Tuesday, May 21, 2024

క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం.. సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

పెద్దపల్లి : ఆటల్లో రాణించే పోలీస్‌ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆల్‌ ఇండియా పోలీస్‌ జూడో క్లస్టర్‌ జిమ్నాస్టిక్‌ పోటీల్లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉదయ్‌ కిరణ్‌ను సీపీ అభినందించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి జోన్‌ పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉదయ్‌ కిరణ్‌ సెప్టెంబర్‌ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలో సిఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడవ ఆల్‌ ఇండియా జూడో క్లస్టర్‌ జిమ్నాస్టిక్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు.

ఈ సందర్భంగా బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన కానిస్టేబుల్‌ ఉదయ్‌ కిరణ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించిన అనంతరం మాట్లాడుతూ… ఆటలు కేవలం దేహ దారుఢ్యానికే కాకుండా, ఆరోగ్యం, మానసికోల్లాసానికి కూడా దోహదపడతాయన్నారు. ఉదయ్‌ కిరణ్‌ భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ, ఎళ్లవేళలా అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ మోహన్‌, సిఐ ప్రదీప్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement