Tuesday, April 30, 2024

టీచర్లకు ప్రభుత్వ సాయం..

ఎల్లారెడ్డిపేట: కరోనా కారణంగా పాఠశాలలు మూత పడడంతో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ ప్రకటించిన 25 కిలోల బియ్యం, రూ. 2వేల నగదును ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. స్థానిక జ్ఞానదీప్‌ పాఠశాలకు చెందిన 50 మంది టీచర్లకు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్‌, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ కొండాపురం బాల్‌రెడ్డి, ఎంపీటీసీ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్‌రెడ్డిలు సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కొండ రమేష్‌, తెరాస మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, ఆర్‌ఎస్‌ఎస్‌మండల అధ్యక్షుడు రాదారపు శంకర్‌, వైస్‌ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్‌, నాయకులు పిల్లి కిషన్‌, ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్‌ కరస్పాండెంట్‌ లక్ష్మినారాయణ, టీచర్స్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement