Wednesday, March 27, 2024

విద్యార్థులు ట్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలి.. కేటీఆర్

విద్యార్థులు ఇచ్చిన ట్యాబ్ లని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందన్నారు. ఎల్లారెడ్డి పేటలో రూ.7కోట్లతో ఉన్నత పాఠశాలను, జూనియర్ కాలేజి మైదానమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడిని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గంభిరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కన్నుల్లో ఆనందం చూడటానికి ట్యాబ్ లను పంపిణీ చేయడం విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

స్వచ్ఛ సర్వెక్షన్ ప్రోగ్రాంలో జిల్లా ముందుందని, అందుకు కృషి చేసిన కలెక్టర్ కు, అన్ని శాఖల అధికారుల, నేతల కృషి అని మంత్రి తెలిపారు. త్వరలో వేములవాడ నియోజకవర్గంలోని విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు నీట్, ఐ ఐ టితో పాటు పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబ్ కాబ్ చైర్మెన్ రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, డి ఐ జి రమేష్, ఎస్ పి అఖిల్ మహాజన్, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, ఎంపిపి రేణుక, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య, బీఅర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగాయ్యా, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఎంపిటిసిలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement