Saturday, April 27, 2024

సింగరేణి అద్భుత ప్రగతిపై సమీక్ష

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా పరిధిలో సోమవారం జీఎం వెంకటేశ్వర్‌రావు జీఎం కార్యాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్ల కాలంలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందని జీఎం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ఉత్పత్తి, ఉత్పాదకత రంగాల్లో దూసుకుపోతుందన్నారు. ప్రగతిపై విడుదల చేసిన పుస్తకాలలో ఈ విషయాన్ని వివరించామన్నారు. మరింత ఉత్సాహంతో ఉద్యోగులు ముందుకు సాగాలన్నారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, అధికారులు సాంబయ్య, రాధాకృష్ణారావు, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, ధనుంజయ్‌, రాజేశ్వర్‌, పీవీ రమణ, బీవీవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌, సురేశ్‌బాబు, చంద్రమౌళి, అజయ్‌కుమార్‌, సుబ్రహ్మణ్యం, వంశీధర్‌, నాయకులు చిప్ప సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement