Tuesday, May 21, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఎంపీపీ..

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎంపీపీకి వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మళ్లీ కోవీడ్‌ విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరూ వ్యాక్సిన్‌ తీసుకొని కరోనా బారి నుండి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement