Thursday, May 2, 2024

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వేములవాడ పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టిన వీటీడీఏ, టీయూఐఎఫ్‌డీసీ పనులకు, రూ. 52 కోట్లతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రెన్యువల్‌ పనులకు డాక్టర్‌ సినారె కళా మందిరం ఆవరణలో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అలాగే రుద్రంగి మండల కేంద్రంలో రూ.3.50 కోట్లతో నూతనంగా చేపట్టిన కేజీబీవీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement