Sunday, April 28, 2024

‘ఆటా’ మహాసభలలో కరీంనగర్​కు ప్రాధాన్యం.. అదనపు కలెక్టర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడికీ ఆహ్వానం

కరీంనగర్‌, (ప్రభన్యూస్‌): అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌ (ఆటా) వారు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న ఆటా కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని కరీంనగర్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గాజుల శ్యాంప్రసాద్‌ లాల్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిఆర్‌టీయూ తెలంగాణ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ కు ఆటా ప్రతినిధులు ఆహ్వానం పంపించారు. ఈ ఏడాది జులై 1వ తేది నుండి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగే ఆటా కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌కు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌, గోనె శ్రీనివాస్‌ అతిథులుగా హాజరు కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి హాజరయ్యే వివిధ రంగాల ప్రముఖులలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరికీ ఆహ్వానం లభించడం విశేషం. ఈసందర్భంగా జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌, గోనె శ్రీనివాస్‌కు వారి మిత్రులు ఈవీ శ్రీనివాస్‌ రావు, రవికిశోర్‌, మనోహర్‌, రామ్మోహన్‌, అన్నవరం దేవేందర్‌, మాడిశెట్టి గోపాల్‌, కృష్ణకుమార్‌, వేణుమాధవ్‌ రెడ్డి, కిరణ్‌, శరత్‌, నాయిని కృష్ణలు అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement