Monday, April 29, 2024

Peddapalli: కాంగ్రెస్‌ను నమ్మితే.. ఖేల్‌ ఖతం.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, నవంబర్‌ 25 (ప్రభన్యూస్‌): 60ఏళ్లు అధికారమిస్తే.. ఏం చేశారు.. ఆరు గ్యారెంటీలంటూ.. వచ్చిన వారు ఇప్పుడేం చేస్తారని.. కాంగ్రెస్‌ను నమ్మితే ఖేల్‌ ఖతం.. దుకాణ్‌ బందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి విమర్శించారు. శనివారం సుల్తానాబాద్‌ మండలం అల్లీపూర్‌, రేగడి మద్దికుంట గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని, ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీలేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్‌ అందిస్తున్న పథకాలు లేవన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కేసీఆర్‌ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ వంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు.

ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే వెంట జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్‌ పాల రామారావు, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మార్కెట్‌ ఛైర్మెన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్‌చందర్‌ రావు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్‌ బోయిని రాజమల్లయ్య, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌లు గడ్డం మహిపాల్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుర్రాల మల్లేశం, కన్వీనర్‌లు మైలారం నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు క్యాదాసి చంద్రమొగిలి, గరిగంటి కుమార్‌ బాబు, కల్వల లావణ్య, అన్నేడి మార్కెట్‌ వైస్‌ ఛైర్మెన్‌ మహిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ వసంత మోహన్‌ రెడ్డి, ఎంపీటీసీ గడ్డం రాజమణి, ఉపసర్పంచ్‌ ఆవుల వెంకటేష్‌, డైరీ ఛైర్మెన్‌ ఐలయ్య, గ్రామశాఖ అధ్యక్షులు నల్లంగి సదయ్య, బొజ్జ సతీష్‌, మాజీ సర్పంచ్‌ రాజ కొమురయ్య, మాజీ ఎంపీటీసీ తాండ్ర తిరుపతి, సురుకొంటి శారద, సీనియర్‌ నాయకులు గట్టు శ్రీనివాస్‌, బోయిని శ్రీనివాస్‌, పెర్క రమేష్‌, అన్నేడి నిశాంత్‌ రెడ్డి, నాగరాజు, వడ్లకొండ తిరుపతి, శ్రీనివాస్‌, వెంకట్రాజం, రమేష్‌, మానస శ్రావణ్‌, మంజుల, శ్రీనివాస్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, కుమారస్వామి, బాలయ్య, గట్టయ్య, బుర్ర రమేష్‌, తడిగోప్పుల శ్రీనివాస్‌, యూత్‌ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పాలకవర్గం, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement