Tuesday, April 30, 2024

FLASH: పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పెళ్లి సందడి జరుగుతున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి పనుల కోసం కూరగాయలు తీసుకొని తిరుగు ప్రయాణంలో కరీంనగర్ చొప్పదండి మధ్యలో రుక్మాపూర్ శివారులో సోమవారం తెల్లవారుజామున హర్వెస్ట్రాను కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చొప్పదండి పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు మాచర్ల బాలు, మాచర్ల అక్షయ్ లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement