Friday, May 17, 2024

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

కాటారం రూరల్ : వడదెబ్బతో ఉపాధి కూలి మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని దూలం చెరువులో ఏప్రిల్ 25న ఉపాధి పనులు నిర్వహిస్తుండగా అట్టికేటి రామక్క (59) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి కూలీలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఈ విషయంపై గ్రామ ఉపసర్పంచ్ ఆకుల చంద్రశేఖర్, గ్రామ ప్రజలు మాట్లాడుతూ… ఉపాధిహామీ నిబంధనల ప్రకారం వేసవిలో సరైన ఏర్పాట్లు చేయడం లేదని, ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామక్క మృతి చెందారని ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని, ఉప సర్పంచ్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement