Friday, March 29, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీపీ సుబ్బారాయుడు

సుప్రసిద్ధ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు దర్శించుకున్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి విచ్చేసిన సీపీ సుబ్బారాయుడుకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని సీపీకి ఆలయ ఈఓ వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, మల్యాల ఎస్ఐ చిరంజీవితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement