Friday, May 3, 2024

BJP: బండి సంజయ్ దాతృత్వం.. ఆలయానికి గ్రానైట్ వితరణ…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పట్టణం 19వ డివిజన్ విజయపురి కాలనీలో గల ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణానికి గ్రానైట్ వితరణ చేశారు. ఇటీవల దేవాలయ కమిటీ ప్రతినిధులు, బిజెపి నాయకుడు పొన్నాల రాము ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి దేవాలయ ప్రాంగణంలో గ్రానైట్ వేయించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దేవాలయ ప్రాంగణానికి అవసరమైన గ్రానైట్ మొత్తాన్ని ఎంపీ బండి సంజయ్ కుమార్ అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రానైట్ అందించినందుకు దేవాలయ కమిటీ ప్రతినిధులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement