Friday, May 3, 2024

యూజీ ఆయుష్ మెడికల్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్..

కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు.

నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సబంధించి ఇతర సమాచారానికి వెబ్‌సైట్‌లో సంప్రదించాలని వర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement