Sunday, April 28, 2024

TS: పట్టాలు కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తా – దామోదర రాజనర్సింహ

గద్వాల (ప్రతినిధి) జనవరి 27 (ప్రభ న్యూస్) : ప్లాట్ల ప‌ట్టాలు కోల్పోయిన పేద‌ల‌కు న్యాయం చేస్తాన‌ని రాష్ట్ర‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం గద్వాల జిల్లాకు చేరుకున్నఆయ‌న అల్లంపూర్ గద్వాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న 300 పడకల ఆసుపత్రిని సందర్శించారు మంత్రి దామోదర రాజనర్సింహ. గద్వాల పట్టణంలోని 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనుల పరిశీలన చేసిన అనంతరం అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళ పటాలను తీసుకుని వాటి స్థానంలో అక్కడ కొత్తగా నిర్మాణం చేపడుతున్న 300 పడకల ఆసుపత్రి చేపడుతున్న విషయం తెలిసింది.

అయితే పట్టాలు కోల్పోయిన బాధితులు మంత్రి పర్యటన సందర్భంగా అక్కడికి చేరుకొని న్యాయం చేయాలని మంత్రిని కోరగా.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశానికి మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా గద్వాల మండల పరిధిలోని అనంతపురం స్టేజీ వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహకు గజమాలతో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement