Thursday, April 25, 2024

జర్నలిస్టు రాఘవులు కుటుంబానికి మీడియా మిత్రుల చేయూత

భూపాలపల్లి(గణపురం): ఈనెల19న గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందిన భూపాలపల్లి ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్టు ముక్కెర రాఘవులు గౌడ్ కుటుంబానికి ఈరోజు గణపురం మండల మీడియా మిత్రులు చేయూతనందించారు. మండలంలోని వివిధ పత్రికల్లో విధులు నిర్వహిస్తున్న విలేఖరులు సమిష్టిగా రూ.15 వేలను మృతుడు రాఘవులు కుమారుడు హేమంత్ కు అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా మృతుడు రాఘవులు కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగపురి శ్రీనివాస్ గౌడ్, పసునూటి రవి, కత్తెర రామకృష్ణ, ఎడ్ల సంతోష్, తంగళ్ళపల్లి వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, తాళ్లపల్లి రామకృష్ణ, రౌతు కిషోర్, నరిగె రాజ్ కుమార్, లావుడ్య వినోద్, గట్టు రవీందర్ గౌడ్, దూలం కుమారస్వామి గౌడ్, బత్తిని విష్ణువర్ధన్, కొయ్యల గౌతమ్, కొమురాజు రమేష్, పావుశెట్టి శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement