Friday, May 17, 2024

Jogulamba Gadwal – మరణించిన పోలీసు కుటుంబానికి భ‌ద్ర‌త ఎక్స్ గ్రేషియా చెక్ అంద‌జేసిన ఎస్పీ సృజన

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జూన్ 21 (ప్రభ న్యూస్) – అనారోగ్యం తో మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కె. సృజన భద్రత ఎక్స్ గ్రేషియా క్రింద 3,96,630/- రూపాయల ఆర్థికసాయాన్ని అందజేసారు. జిల్లా కేంద్రంలో సాయుధ దళ కార్యాలయం లో ఏ ఆర్ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న పి. యాదయ్య గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్ తో మరణించారు.. తాజాగా ఆయ‌న కూతురు శ్రీదేవి కి భద్రత ఎక్స్ గ్రేషియ క్రింద 3,96,630/- (మూడు లక్షల, తొంబై ఆరు వేల, ఆరు వందల ముప్పై) రూపాయల చెక్ ను జిల్లా ఎస్పీ సృజన అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, వారి కూతురు విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ
ఓ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ. ఓ సతీష్, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్, ఆర్. ఐ నాగేష్, యాదయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement