Friday, May 3, 2024

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పాజిటివ్

తెలంగాణలో ప్రజాప్రతినిధులు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. స్పీకర్ పోచారం సైతం కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ మేరకు జనగామ టీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జా సంపత్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా గత రెండు రోజుల పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్ట్ చేయించుకోగలరని కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందు వల్ల ఫోన్ లో కూడా అందుబాటులో ఉండరని, వారం రోజుల తరువాత ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని తెలిపారు. జనగామ నియోజకవర్గ నాయకులు, ప్రజలు గమనించి సహకరించాలని జనగామ టీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జా సంపత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement