Thursday, May 16, 2024

TS: మేడారం జాతర.. జనసంద్రమైన జంపన్నవాగు..

మేడారం (మంగపేట), ఫిబ్రవరి 21 : మేడారం జాతరకు వచ్చిన భక్తులతో బుధవారం జంపన్నవాగు జన సంద్రమైంది. మేడారం వన దేవతల దర్శనంకు వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగు వద్దకు చేరుకుని అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం తల్లుల గద్దెలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.

బుధవారం మేడారం జాతరకు వచ్చిన భక్తులతో జంపన్నవాగుకు ఇరువైపులా కిక్కిరిసిపోయింది. జంపన్న వాగులో పుష్కలంగా నీరు ఉండడంతో కొంతమంది భక్తులు జంపన్నవాగులో, మరి కొంతమంది భక్తులు జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. ఇసుక వేస్తే రాలనంత భక్త జనంతో జంపన్నవాగు ప్రాంతం సందడిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement