Monday, May 6, 2024

Jagityala – ఎస్పీ ఆఫీస్, సమీకృత మార్కెట్ లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

జ‌గిత్యాల : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ జ‌గిత్యాల జిల్లాలో నేడు ప‌ర్య‌టిస్తున్నారు. దీనిలో భాగంగా జ‌గిత్యాల‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 40 కోట్ల‌తో నిర్మించిన జిల్లా పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యాన్ని, నూకపెల్లి వద్ద 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేసీఆర్‌ కాలనీని, మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను హోంమంత్రి మ‌హ‌ముద్ అలీతో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్, ఎమ్మెల్యేలు డాక్ట‌ర్ సంజ‌య్, బాల్క సుమ‌న్, సుంకె ర‌విశంక‌ర్‌, విద్యాసాగ‌ర్ రావు, ఎంపీ వెంక‌టేశ్ నేత‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement