Tuesday, April 30, 2024

BREAKING NEWS : మిర్యాలగూడ బీఆర్​ఎస్​ అభ్యర్థి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో వ‌రుస‌గా ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల పొంగులేటి శ్రీ‌నివాస్‌, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి బంధులు, రాజ‌గోపాల్‌రెడ్డి బంధువుల ఇండ్ల‌లో సోదాలు నిర్వ‌హించిన ఐటీ అధికారులు ఇవాళ న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో ఐటీ త‌నిఖీలు నిర్వ‌హించారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి భాస్క‌ర్‌రావు బంధువులు, అనుచ‌రుల ఇళ్ల‌లో త‌నీఖీలు నిర్వ‌హిస్తున్నారు.

ఏక కాలంలో 40 బృందాలతో ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement