Saturday, April 20, 2024

రేవంత్ రెడ్డిని సన్మానించిన ఐఎన్టియూసి నాయకులు

నిజామాబాద్, మార్చి (ప్రభ న్యూస్) 15: కార్మిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నిజాంబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రామంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డిని ఐఎన్టియూసి రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలు వాతో ఘనంగా సన్మానించారు. కార్మికుల సమస్యలపై పలు విషయాలపై రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమ ములో ఐఎన్టియూసి రాష్ట్ర , జిల్లా నాయకులు ఏడ్ల నాగరా జు, పుదరి గంగాధర్,వేణు గోపాల్, పెంటాచారీ, జాక్రియ, కార్తిక్, మొహియుద్దీన్, శ్రీనివా స్, భుమేష్,అసిఫ్, నాంపల్లి, మోహన్, మీర,గంగాధర్,చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement