Wednesday, April 24, 2024

ఢిల్లీలో వైసీపీ ఆఫీసుకు భూమి ఇవ్వండి.. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లన చంద్రశేఖర్, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య తదితరులు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును క్యాంపు కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అనేక న్యాయ పరమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా కలియుగ దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కేంద్ర మంత్రికి బహూకరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement