Monday, April 29, 2024

TS: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు. పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థులకు మాత్రం వెంటనే భద్రత కల్పించాలని సూచించారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని ముగించి తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement