Friday, May 10, 2024

Exclusive | శేరిలింగంపల్లిలో లక్ష్మీపుత్రులు.. టౌన్​ ప్లానింగ్​ పేరిట గట్టిగనే పిండుతున్నరు!

గ్రేటర్ హైదరాబాద్​ లో లక్ష్మీ పుత్రులు పుట్టుకొస్తున్నరు. పలు సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న చైన్ మెన్ లు లక్ష్మీ పుత్రులే అని చెప్పవచ్చు. ఇందులో శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిదిలో విధులు నిర్వహిస్తున్న చైన్ మెన్​ని అయితే సాక్షాత్తు లక్ష్మీ పుత్రుడని పలువురు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి , కొండాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టాడాలకు వీరి అనుమతి తప్పనసరి అవుతోంది. కొండాపూర్ మెయిన్ రోడ్డుపై 80 గజాల లోపు స్థలంలో 5 అంతస్తులు పూర్తి కావడం.. 6 వ అంతస్తుకు పిల్లర్లు పైకి లేపడంలో వీరి పూర్తి హస్తం ఉందని సమాచారం అందుతోంది.

నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై చిన్నపాటి స్థలంలో నిర్మాణం వెనుక చైన్​మెన్​ హస్తం ఉందని, అందుకనే దర్జాగా ఇట్లాంటి నిర్మాణం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇట్లాంటి అవినీతి, అరాచకపు సిబ్బందిని ఉద్యోగంలో కొనసాగించడం వెనకాల ఎవరి హస్తం ఉందన్న దానిపై చాలామంది ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వీరి విషయంలో చొరవ తీసుకుని విధుల నుంచి తప్పించకపోతే అటు పాలకవర్గానికి, ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement