Monday, May 6, 2024

ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే దాసరి

రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

అనంతరం మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లిం లు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసామన్నారు. రాబోయే రంజాన్ వినని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులతోపాటు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement