Saturday, May 4, 2024

TS: విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి… జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, ఫిబ్ర‌వరి 21 (ప్రభ న్యూస్): విజయ సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప రథయాత్ర ఎల్బీనగర్ నియోజకవర్గంలో 23 తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు బి.ఎన్.రెడ్డి నగర్ లో చౌరస్తాలో ప్రారంభమై రాత్రి 10 గంటలకు నాగోల్ చౌరస్తాలు ముగుస్తుందని తెలిపారు.

రథయాత్ర బియన్ రెడ్డి నగర్ హస్తినాపురం బైరామల్ గూడ కర్మాన్ఘాట్ సరూర్నగర్ దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం చైతన్యపురి మోహన్ నగర్ నాగోల్ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా మోర్చా, ప్రతి ఒక్కరూ రథయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని గా మోడీ బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు పవన్ కుమార్ , నవజీవన్ రెడ్డి, ప్రేమ ఈశ్వర్ రెడ్డి రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు చింతల సురేందర్ యాదవ్ కొత్త రవీందర్ గౌడ్, బండారి భాస్కర్,, మహిళా మోర్చా నేతలు తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని గా మోడీ బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు పవన్ కుమార్ , నవజీవన్ రెడ్డి, ప్రేమ ఈశ్వర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు చింతల సురేందర్ యాదవ్, కొత్త రవీందర్ గౌడ్, బండారి భాస్కర్, మహిళా మోర్చా నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement