Monday, April 29, 2024

AP: శ్రీశైలమహాక్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం…

శ్రీశైలమహాక్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమ‌య్యాయి. ప్రధానాలయంలోని శ్రీస్వామిఅమ్మవార్ల గర్భాలయ విమానాలకు,ఆలయప్రాంగణంలోని అన్ని ఉపాలయాలకు, ఆలయప్రాంగణంలోని పునరుద్ధరించబడిన మూడు శివాలయాలలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.

క్షేత్రపరిధిలోని అన్ని ఆలయాలకు పంచమఠాలకు కుంభాభిషేకం జరుగుతుంది. సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార – పంచధార, శిఖరేశ్వరం, ఇష్టకామేశ్వరీ ఆలయాలలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయ ఉత్తరగోపురమైన శివాజీగోపుంపై కలశ పున: ప్రతిష్ట చేయనున్నారు. కార్యక్రమాలలో కంచి, శ్రీశైలం, పుష్పగిరి పీఠాధిపతులు పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement