Friday, May 17, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి ఘ‌న విజ‌యం…..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీ దేవి విజ‌యం సాధించారు.. రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ బి జె పి ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావుపై గెలుపొందారు.. ఈ ఎన్నిక‌ల‌లో చివ‌రి వ‌ర‌కు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు చివ‌రి వ‌ర‌కు గట్టి పోటీ ఇచ్చారు…ఎలిమినేష‌న్ రౌండ్ లో నాగేశ్వ‌ర‌రావు ని తొల‌గించ‌డంతో వాణీకి క‌ల‌సి వ‌చ్చింది.. దీంతో అమెను విజ‌యం వరించింది. హైద‌రాబాద్ జిల్లాలో ప‌రిధిలోని ఎమ్మెల్సీ స్థానాన్ని సుర‌భి వాణీదేవి ద్వారా తొలిసారిగా టిఆర్ ఎస్ కైవ‌సం చేసుకోవ‌డం విశేషం..

అభ్యర్ధులకు లభించిన ఓట్ల వివరాలు

 టి ఆర్ ఎస్ వాణీదేవికి ఒక లక్ష 49 వేల 269 ఓట్లు (149269) రాగా.., బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు ఒక లక్షా 37 వేల 566 (137566) ఓట్లు వచ్చాయి. వాణీదేవికి మెజారిటీ 11703 ఓట్లు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement