సమగ్రాభివృద్ధికి పట్టణ ప్రగతి దోహద పడుతుందని, అందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈనెల 3వ తేదీ నుండి 17వ తేదీ వరకు నగరంలో చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్.బి.టి నగరలో మేయర్ పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పలు వీధుల్లో కలియతిరిగి సమస్యలను అడిగి అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పించారు. నిర్మాణ వ్యర్థాలు ఇంటి ముందు ఉంచకుండా వెంటనే తొలగించాలని, నిర్మాణ వ్యర్థాలు నోటీసులు జారీ చేసిన పిదప తొలగించని పక్షంలో జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. ప్రవేటు స్థలంలో ఉన్న వ్యర్థాలు ముళ్ల పొదలని యజమాన్యం తొలగించని పక్షంలో జరిమానా వేసి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కాలనీ వాసులకు వివరించారు. పట్టణ ప్రగతి ద్వారా మెరుగైన సేవలతో పాటు అభివృద్ధి ప్రణాళిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ పట్టణ ప్రగతి, దోమల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తయారు చేసిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, ఖైరతాబాద్ జోనల్ ఎస్.సి రత్నాకర్, డి.సి తదితరులు పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధికి పట్టణ ప్రగతి దోహద పడుతుంది – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
![vijaya](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/06/vijaya-1-696x364.jpg)
Advertisement
తాజా వార్తలు
Advertisement