Friday, May 17, 2024

ఈ నెల 18, 19న జర్నలిస్టుల శిక్షణా తరగతులు.. ఆర్టీసీ క‌ల్యాణ‌మండపంలో నిర్వ‌హ‌ణ‌

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా జర్నలిస్టుల శిక్షణా తరగతులు ఈ నెల 18, 19న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులలో మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, శాసన మండలి, శాసనసభ సభ్యులు అతిథులుగా పాల్గొని జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించ‌నున్నారు. మీడియాలో నిష్ణాతులైన సీనియర్‌ జర్నలిస్టులు, ఎడిటర్లు, వారి అనుభవాలను జర్నలిస్టులతో పంచుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement