Tuesday, April 30, 2024

Safe Cities | ఇండియాలో సేఫెస్ట్ సిటీస్ ఇవే.. హైదరాబాద్‌ ర్యాంక్ ఎంతంటే.!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో చోటు చేసుకుంటున్న నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ‘‘క్రైమ్ ఇన్ ఇండియా 2022 ’’ ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన సిటీగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022లో కోల్‌కతాలో ప్రతి లక్ష మందిలో 86.5 కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌ ర్యాంక్ ఎంతంటే.!

ఇక NCRB రిలీజ్‌ చేసిన ఈ జాబితాలో పుణే, హైదరాబాద్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పుణేలో ప్రతి లక్ష మంది జనాభాకు 280.7 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లో 299.2 కేసులు నమోదైనట్లు NCRB డేటా వెల్లడించింది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నేరాలను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్టును విడుదల చేశారు.

- Advertisement -

మహిళలపై నేరాలు..

మహిళలపై నేరాలు కోల్ కతాలో 2022 లో పెరిగాయి. ఈ నగరంలో ప్రతీ లక్ష జనాభాకు 2022 లో మహిళలపై 1890 నేరాలు జరగగా, 2021 లో 1783 నేరాలు జరిగాయి. అలాగే, కోల్ కతాలో 2022 లో 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదయ్యాయి.

అయితే, ఐపీసీ, ప్రత్యేక, స్థానిక చట్టాల సెక్షల కింద నమోదైన కేసులను (Cognisable crimes) మాత్రమే NCRB పరిగణలోకి తీసుకుంది. 2020, 2021లోనూ కోల్‌కతా ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులోనే నిలిచింది. 2021లో కోల్‌కతాలో ప్రతి లక్ష జనాభాకు 103.4 గుర్తించదగిన కేసులు నమోదు కాగా.. 2020లో 129.5 కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 2021లో 259.9 కేసులు నమోదు కాగా.. పుణేలో 256.8 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement